ఆ ముగ్గురికీ ఆ ‘టెస్ట్’ చేస్తారట..
posted on May 15, 2015 9:46AM

కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. మొదట ఆమెది అనుమానాస్పద మృతి అని భావించినప్పటికీ, తర్వాత అది హత్యగా పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. సునంద హత్య జరిగిన రోజున, అంతకుముందు జరిగిన పరిణామాలను పరిశోధిస్తున్న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ముగ్గురు సాక్షులుగా వున్న శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరేకు తమకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ ముగ్గురూ దర్యాప్తుకు సహకరించకుండా తమ ప్రశ్నలకు నోటికి వచ్చిన సమాధానాలు చెబుతున్నారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది.