రైతులకు షాక్.. భూసేకరణకు జీవో

 

ఆంధ్రరాష్ట నూతన రాజధాని కోసం భూములు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు, ఇవ్వమని రైతులు చెపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను రైతులు ఇవ్వాలని జీవోను జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2, 3 చాప్లర్ల నుంచి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ జీవో 166ను జారీ చేసింది. భూసేకరణకు సంబంధించిన అన్ని అధికారాలను కలెక్టర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుండి ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకుంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu