నేటి నుండి గోదావరి నిత్య హారతి

 

కాశీ పుణ్యక్షేత్రంలో రోజూ సాయంత్రం జరిగే గంగా (నది) హారతిని చూసి తరించేందుకు దేశంలో నలుమూలల నుండి ప్రజలు తరలి వస్తుంటారు. ఆ ప్రేరణతోనే ఆంధ్రులకు పరమ పవిత్రమయిన గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి చిన్న రాజప్ప, మంత్రులు దేవేనేని ఉమామహేశ్వర రావు, పి. సుజాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై. ఆర్. కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, రాజమండ్రి యం.పి. మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu