మేరీ కోం కు మరో అవకాశం.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ

 

రియో ఒలింపిక్స్ లో భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోం అర్హత సాధించలేదన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్  క్వాలిఫయింగ్ కు జరిగిన పోటీల్లో రెండో రౌండ్ లో మేరీ కోం పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు ఆమెకు మరో అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోరాలని భారత్ నిర్ణయించింది. దీంతో రియోలో పాల్గొనాలన్న మేరీ కోం కలలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu