రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి 

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరై సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది.  ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్దికి సహకారమందిస్తామని హామి ఇచ్చారు.