పంజాబ్ డ్రగ్స్ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు...


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని జ‌లంధ‌ర్ వ‌ద్ద ఈరోజు మ‌హా ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేప‌ట్టగా.. ఆకార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్రగ్స్, లా అండ్ ఆర్డర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు పేట్రేగిపోతున్నాయని.. తామకి కనుక విజయాన్ని అందించి.. అధికారం కట్టబెడితే డ్రగ్స్ లేకుండా చేస్తామని అన్నారు. పంజాబ్ లో డ్ర‌గ్స్ అత్యంత తేలికైన వ్యాపారంగా మారిపోయింద‌ని, వాటిని అరిక‌ట్ట‌డంలో పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆయ‌న అన్నారు. మ‌త్తు ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేసే వారి నుంచి పంజాబ్ ప్ర‌భుత్వం లాభం పొందుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌ధాన మంత్రి మోదీ కూడా ఈ అంశంపై నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మరి రాహుల్ వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu