ఆ రిజర్వేషన్లకు మేం ఒప్పుకోం – కృష్ణయ్య!


 



 

కాపులను బీసీలలోకి చేర్చేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కుండబద్దలు కొట్టేశారు. వారిని కనుక బీసీల జాబితాలోకి చేరిస్తే ఇప్పటివరకూ ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణయ్య ఇచ్చిన పిలుపుతో నిన్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని కలెక్టరు కార్యాలయాల వద్దా బీసీ నాయకులు ధర్నాలను నిర్వహించారు. ప్రస్తుతం తెలుగుదేశం తరఫున ఎల్‌.బీ.నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణయ్య, తెదెపా కనుక ఈ రిజర్వేషన్లను కల్పిస్తే చంద్రబాబుని సైతం ఎదిరిస్తానని చెబుతున్నారు. ఒకవేళ కాదు కూడదు అంటూ కాపులకు రిజర్వేషన్లను అందిస్తే… అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా 25 నుంచి 50 శాతానికి పెంచేవరకూ ఊరుకోమని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu