విజయవాడలో లోకోపైలట్ ను  ఇనుపరాడ్డుతో హత్య చేసిన సైకో 

విజయవాడ రైల్వేస్టేషన్ లో లోకో పైలట్ ను సైకో చంపేశాడు. ఇనుపరాడ్డుతో లోకోపైలట్ పై శుక్రవారం తెల్లవారు జామున దాడి చేశాడు. దుర్గ గుడి దగ్గర ఈ సైకో ఆటో డ్రైవర్ పై హత్యాయత్నం చేశాడు. పోలీసులు అదుపులో తీసుకుని రైల్వేస్టేషన్ లో వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడో నెంబర్ ప్లాట్ ఫామ్ పై లోకో పైలట్ పై దాడి చేసి హత్య చేశాడు. అయితే అటు రైల్వే పోలీసులు, ఇటు విజయవాడ పోలీసులు కానీ స్పందించలేదు. సైకోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలవాటుపడ్డ సైకో ఈ హత్యకు పాల్పడినట్టు సమాచారం.హత్యకు గురైన లోకో పైలట్ ఇతనే.