కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కొండగట్టుకు చేరుకున్న ఆయనకు మార్గమధ్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు సందర్శనను పురస్కరించుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.