స్కూలు బస్సు ప్రమాదం బాధితులకు పవన్ కళ్యాణ్ పరామర్శ!

 

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొని 20 మంది చిన్నారులు చనిపోవడం బాధాకరమని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చిన్నారుల కుటుంబ సభ్యులను ఆయన ఈ సందర్భంగా ఓదార్చారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాల రక్షణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu