బీజేపీలో చేరమని పవన్ కి పిలుపు!!

 

గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ తెలుగు దేశం నాయకులు మోదీకి జగన్‌ అవినీతి పుత్రుడు, పవన్‌ దత్త పుత్రుడని విమర్శలు చేస్తున్నారని తాను మోదీ దత్త పుత్రుడిని కానని కొణిదల వెంకట్రావు పుత్రుడినని పవన్‌ స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో చంద్ర బాబే తన మద్దతు కోరారని,అప్పుడు మద్దతు కోసం నన్ను దేశభక్తుడన్నారు ఇప్పుడు ప్రశ్నిస్తుంటే విమర్శలు చేస్తున్నారని తెలిపారు.2104 ఎన్నికల తర్వాత భాజపాలో చేరమని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కోరినా తాను వెళ్లలేదని చెప్పారు.బీజేపీ ద్రోహం చేసిందన్న మాటమీదే తాను ఉన్నానని తేల్చి చెప్పారు.2016 నుంచి ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నది జనసేన ఒక్కటే అన్నారు.

పోలవరం నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించిన పవన్ మాదాపురం గ్రామంలో నిర్వాసితులతో సమావేశం అయ్యారు.అనంతరం వారి ఇళ్లు కూల్చివేసిన పైడిపాక గ్రామాన్ని సందర్శించారు.ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కూల్చివేసి వారు రోడ్లుపై కూర్చుంటే అప్పుడు నిర్వాసితుల సమస్యలు తెలుస్తాయని అన్నారు.అమరావతికి రోజుకు 20 బస్సులు ఏర్పాటుచేస్తానని, అక్కడికి వెళ్లి గోడు వెళ్లబోసుకోవాలని నిర్వాసితులకు సూచించారు.జగన్‌ పాదయాత్ర చేసుకుంటూ ముద్దులు పెడుతూ ముందుకెళ్తున్నారని, అది తన నైజం కాదని, ప్రశ్నించడానికే జనసేన వచ్చిందని పవన్‌ పేర్కొన్నారు.