రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత ... కాంగ్రెస్ నేత అరెస్ట్

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు ఇళ్లు,కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల్లో సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేసినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్ కుమార్ అరెస్ట్‌తో  నిజామాబాద్ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu