లోకేశ్ పథకానికి ఇంప్రెస్ అయిన కేంద్రమంత్రి
posted on Dec 3, 2015 2:20PM

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న పథకాలు ఇప్పుడు కేంద్రానికి సైతం నచ్చి సాయం చేస్తున్నాయి. నారా లోకేశ్ యువతలో నైపుణ్యత పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో లోకేష్ శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా యువతకు నైపుణ్యత పెంపొందించాలని.. దీనిలో భాగంగానే ఇప్పటి వరకూ 1500 మందికి వివిధ విభాగాల్లో శిక్షణ కూడా ఇచ్చారు. అయితే దీన్ని ఇంకా విస్తరింపజేయాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. దీంతో ట్రస్ట్ చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి తెలుగుదేశం ఎంపీలు ట్రస్టు అధికారులతో కలిసి కేంద్ర స్కిల్ డెవలప్ పెంట్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు ట్రస్ట్ గురించిన వివరాలు అన్ని చెప్పేసరికి రూడీ కూడా వారు చెప్పిన అంశం నచ్చి.. ప్రతి నియోజకవర్గానికి మూడుకోట్ల రూపాయలను ప్రాథమికంగా మంజూరు చేయటానికి అంగీకరించారు. మొత్తానికి నారా లోకేశ్ చేపట్టిన పథకం కేంద్రమంత్రిని ఇంప్రెస్ చేయడం సంతోషించాల్సిన అంశమే.