లొంగిపోయిన వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి..
posted on Dec 3, 2015 3:14PM
.jpg)
రాజకీయ నాయకులకు దూకుడు ఉంటడం సహజమే.. కానీ అది ఎక్కువైనప్పుడే కాస్త తలనొప్పులు ఎదురవుతాయి. వైకాపా పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. వైకాపా పార్టీలో అందరి కంటే చెవిరెడ్డికి కాస్త దూకుడు ఎక్కువనే చెప్పొచ్చు. ఈ మధ్య రేణిగుంట విమానాశ్రయంలో ఆయన ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ మీద చేయి చేసుకోవడం తెలిసింది. దీంతో ఆయన మీద ఒకటే విమర్శలు. అంతేకాదు పార్టీ నేతలు కూడా చెవిరెడ్డిపై జగన్ కు ఫిర్యాదు చేశారంట. ఇక చెవిరెడ్డి మీద చర్యల కోసం పోలీసులు వెతికే పరిస్థితి. దీంతో పరిస్థితి గమనించిన చెవిరెడ్డి తానే పోలీసుల దగ్గర లొంగిపోయాడు. బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టులో చుక్కెదురైంది. దీంతో అయిన చెవిరెడ్డి అతి దూకుడు పనికి రాదని తెలుసుకుంటారో? లేదో?