సీఎం దీక్ష మీద మురళి మోహన్ జోకు


టీడీపీ ఎంపీ మురళి మోహన్ ఈ మధ్య బాగా నోరు జారుతున్నారు.. మొన్నటికి మొన్న తిరుపతి వెంకన్నను వెంకన్న చౌదరి అని వ్యాఖ్యానించి విమర్శలు పాలైన మురళి మోహన్, తరువాత పొరపాటున నోరు జారాను, దేవుడికి కులాన్ని ఆపాదించడం నా ఉద్దేశం కాదంటూ క్షమాపణలు కోరారు.. ఇప్పుడిప్పుడే ప్రజలు ఇది మర్చిపోతున్నారు అనుకుంటుండగా మరొక్కసారి నోరు జారి విమర్శలు పాలవుతున్నారు.. కడప ఉక్క కోసం ఓ పక్క సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారు.. చంద్రబాబు కూడా కడప ఉక్కుని సీరియస్ గా తీసుకొని కేంద్రానికి లేఖ కూడా రాసారు.. ఈ లేఖని ఢిల్లీ వెళ్లి కేంద్రానికి అందించిన టీడీపీ ఎంపీలు, సరదాగా మాట్లాడుతూ దీక్ష మీద జోకులు వేసిన వీడియో ఒకటి బయటికి వచ్చింది.. ఈ వీడియోలో మురళి మోహన్ అన్న మాటలు, విమర్శలు మూట కట్టుకుంటున్నాయి.. 'ఏమండీ.. నేనొక ఐదు కేజీలు త‌గ్గాల‌నుకుంటున్నాను.. ఓ వారం రోజుల వ‌ర‌కూ అయితే నేను చేస్తాను’ అన్నారు'.. ఒక వైపు టీడీపీ ప్రభుత్వం, ఏపీకి విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడుతుంటే.. ఎంపీలు ఇలా వెటకారం చేయడం ఏంటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.