క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యం.. ఆరో రోజుకి దీక్ష

 

కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరింది. మరోవైపు ముద్రగడ మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వైద్యం చేయడానికి ముద్రగడ అంగీకరించారని, ఆయనకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రక్తపరీక్షలు చేయాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని, పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

 

కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని.. తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ముద్రగడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu