ధోనికి నాన్ బెయిల్ బుల్ వారెంట్..

 
ఎంఎస్ ధోనికి అనంతపురం జిల్లా కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో విష్ణు అవతారంలో ఉన్నధోని చిత్రం ఒకటి ప్రచురించబడ్డ సంగతి తెలిసిందే. దీనిపై విష్ణు అవతారంలో ధోనీని చిత్రించి హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడనే, దేవతలను అవమానించారని విశ్వ హిందూ పరిషత్ నేత శ్యాంసుందర్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో అనంతపురం కోర్టు  నవంబర్ 7వ తేదీన ధోని కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కానీ ధోని మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. మళ్లీ ఈరోజు దీనిపై విచారణ జరిపిన కోర్టు ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu