దీక్ష విరమించిన సీఎం రమేష్

 

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20న ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఆరోగ్యం క్షీణిస్తోంది, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ, ప్లాంట్‌ వచ్చే వరకు పోరాటం ఆపనని రమేష్ దీక్షను కొనసాగించారు.. ఇప్పటికే దీక్ష పదకొండో రోజుకి చేరుకుంది.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోండటంతో సీఎం చంద్రబాబు, రమేష్ ను పరామర్శించి దీక్ష విరమించాలని కోరారు..  చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రమేష్ దీక్షను విరమించారు.. రమేష్‌కు సీఎం చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu