ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ తప్పేం లేదు..!!

మోత్కుపల్లి నరసింహులు పేరుకి తెలంగాణ నేత అయినా, ఆయన దృష్టంతా ఏపీ పైనే ఉంది.. దానికి కారణం ఆయనకు చంద్రబాబు మీద ఉన్న ఆగ్రహం.. ఈమధ్య మోత్కుపల్లి, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి అధికారం దక్కకూడదని ఏకంగా దేవుడిని కూడా ప్రార్థిస్తున్నారు.. రీసెంట్ గా అవిశ్వాసంపై చర్చ జరగటం.. ఆ చర్చలో ఏపీకి అన్యాయం చేసారని టీడీపీ, బీజేపీని నిలదీయడం.. కాదు బాబే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని మోడీ టీడీపీ ని విమర్శించడం తెలిసిందే.

 

 

అయితే తాజాగా మోత్కుపల్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయం గురించి, చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు త‌ప్పు త‌న‌కేమీ క‌నిపించ‌డం లేదన్న మెత్కుప‌ల్లి, ప్ర‌త్యేక ప్యాకేజీ చాలు అని చంద్రబాబు చెప్పాక‌నే కేంద్రం ప్యాకేజీ ఇచ్చింద‌న్నారు.. అయితే హోదా విష‌య‌మై జ‌గ‌న్‌, ప‌వ‌న్ లు మాట్లాడేస‌రికి.. ఓట్లు పోతాయేమో అనే భ‌యంతో చంద్రబాబు యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని మోత్కుప‌ల్లి ఆరోపించారు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు మోత్కుప‌ల్లి పిలుపునిచ్చారు.