ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్ మిజోరం బడ్జెట్ కంటే ఎక్కువ!
posted on Aug 2, 2023 6:13PM
దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు ఎలక్షన్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను ప్రకటించింది. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించిన ఈ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 54, 545. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వరుసగా 3, 8 స్థానాలలో ఉన్నాయి. ఇందులో ఇందులో తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 1601 కోట్లు అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ రిపోర్ట్ తేల్చింది.
వీరిలో 103 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ. 1,443 కోట్లుగా పేర్కొంది. అలాగే ఏపీలోని 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు అని నివేదిక పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆస్తుల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్నాటక టాప్లో నిలిచింది. కర్నాటకలోని 223 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 14,359 కోట్లు. ఇక, ఈ నివేదికలో రూ.6679 కోట్లతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు నిలిచారు.
దేశంలోని మొత్తం 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234 కోట్లుగా కాగా.. దేశంలోని మొత్తం 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు 15, 798 కోట్లుగా ఏడీఆర్ నివేదిక తేల్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.97 కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 21.97 కోట్లు, వైసీపీ ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 23.14 కోట్లుగా పేర్కొంది.అంతేకాదు, ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్, మిజోరం, సిక్కిం బడ్జెట్కు మించి ఉందని ఏడీఆర్-ఎన్ఈడబ్ల్యూ పేర్కొంది. అందరికంటే తక్కువగా త్రిపురలో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 90 కోట్లుగా తేలింది.