ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి.. బాలకృష్ణ

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన దగ్గర నుండి ఎన్నో రకాల వదంతులు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాజీనామా చేస్తారని వారి స్థానంలో అశోకగజపతిరాజు కానీ, బాలకృష్ణ కానీ సీఎంగా నిలబడతారని చాలా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ తాను ముఖ్యమంత్రి అవుతానని వచ్చిన వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారని సృష్టం చేశారు. రాష్ట్రాన్ని, పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే సామర్ధ్యం చంద్రబాబు ఒక్కడికే ఉందని.. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని అన్నారు.