వైష్ణోదేవి భక్తులపై విరిగిపడిన కొండ చరియలు

వైష్ణోదేవి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. బంగంగా-అర్థ్‌కువారి రోడ్డులో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా త్రికూట హిల్స్ నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు షెల్టర్‌పై పడ్డాయి. దీంతో షెల్టర్‌లో ఉన్న నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. బండరాళ్లను ఎత్తి రోడ్డును క్లియర్ చేశారు. మృతుల్లో బెంగుళూరుకు చెందిన శశిధర్ కుమార్, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గాకు చెందిన బిందు షాని, ఆమె ఐదేళ్ల కుమారుడు విశాల్, జమ్మూకశ్మీర్‌లోని మానస తాండకు చెందిన 34 ఏళ్ల పోనీవాలా మొహమ్మద్ సాదిఖ్ ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu