మావోయిస్టు పార్టీ బెదిరింపు లేఖ
posted on Apr 8, 2025 6:50PM

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది. 2026 మార్చి వరకు మావోయిస్టు రహిత దేశం చేస్తామని కేంద్రం ప్రకటించింది. మావోయిస్టులు ఇటీవల ఎన్ కౌంటర్లతో భారీ మూల్యం చెల్లించుకోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కర్రెగుట్టపై రావొద్దంటూ బాంబులు అమర్చినట్టు చెప్పారు. అమాయక ఆదివాసులు ప్రాణాలు కోల్పోకూడదని నక్సలైట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నక్సలైట్లు ఆరోపించారు. ఆదివాసులకు మాయమాటలు చెప్పి ప్రలోభపెడుతున్న పోలీసులను నమ్మొద్దని నక్సలైట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంకటాపురం వాజేడు కమిటీ పేరిట లేఖ విడుదలైంది.