రేపటి నుంచి విశాఖలో కఠిన ఆంక్షలు
posted on Apr 2, 2020 7:23PM
రేపటి నుండి జిల్లాలో కఠిన ఆంక్షలు ఉంటాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఉదయం 6 నుండి 9 వరకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉంటుందనీ, పచారి షాపులు, పళ్లుమార్కెట్, రైతు బజార్లు, మార్కెట్ కి మాత్రమే సాయం 6 నుండి 9 వరకే తెరిచి ఉంటాయని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి. ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి, ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ , వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఉంటుందనీ, జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లాక్ డౌన్ పూర్తయ్యే వరకూ, ఓపెన్ కు అనుమతి లేదని, పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.