తిరుపతి ఎస్వీయు  క్యాంపస్ లో చిక్కిన చిరుత

కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో  వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి.  తాజాగా  తిరుపతిలోని  ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.ఎట్టకేలకు  అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. చిరుత సంచరిస్తుందని అటవీశాఖాధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమై ఎస్వీయు క్యాంపస్ లోబోనులు, కెమెరాలను ఏర్పాటు చేశారు. బోను వరకు వచ్చి వెళుతున్న చిరుత బోనులోకి రాలేదు. మేకను ఎరవేసినప్పటికీ పులి బోనువైపు చూడలేదు. ఇటీవల క్యాంపస్ ప్రధాన గ్రంధాలయం వెనుక ఒక జింక పిల్లపై చిరుత దాడి చేసి పట్టుకెళ్లింది. జింక పిల్ల రక్తం రుచి మరిగిన చిరుతకు ఎస్వీయు క్యాంపస్ బోనులో కూడా జింకను ఎరగా వేశారు. ఉదయం ఏడుగంటల లోపు సాయంత్రం ఆరు గంటల తర్వాత క్యాంపస్ లో  విద్యార్థులతో సహా ఎవరికీ ఎంట్రీ లేదు. నిన్న రాత్రి  క్యాంపస్ లోని ఓ బోనులో అమర్చిన బోనులో వచ్చి చిక్కింది. చిరుతకు మత్తు ఇచ్చి ఎస్వీ జూపార్క్ కు తరలించారు