157 మందిని మింగేసిన కొండ చరియలు!

ఇథియోపియాలో కొండ చరియలు విరిగిపడి 157 మంది మరణించారు. అడిస్ అబాబా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించి, వాటి కింద చిక్కుకున్న వారిని కాపాడ్డానికి పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తూ వుండగా మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో చాలామంది వాటికింద ఇరుక్కుని మరణించారు. ఆ తర్వాత జరిపిన సహాయక చర్యల్లో ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, పోలీసులు వున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu