రిజిస్ట్రేషన్ల బ్యాన్? అబ్బే అదేం లేదు: మంత్రి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపినట్లు వచ్చిన ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఖండించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పడితే భూముల ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో భూముల యజమానులు, వ్యాపారులు భూములను అమ్ముకోవడం లేదని, రిజిస్ట్రేషన్లు జరగడం లేదని ఆయన చెప్పారు. రాజధాని రాబోతోందన్న అభిప్రాయంతోనే ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా పెరిగాయని, భూముల ధరలు అడ్డగోలుగా పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమానా విధిస్తామని మంత్రి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu