నాంపల్లి కోర్టుకు కేటీఆర్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ దావాకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందకు కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్ల కోర్టుకు హాజరు కానున్నారు.

కొండా సురేఖపై కేటీఆర్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావాపై ఈ నెల 14న విచారించిన కోర్టు.. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశిస్తూ కేసును  శుక్రవారం (అక్టోబర్ 18)కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆయనతో పాటుగా సాక్షులుగా  బీఆర్ఎస్ నేతలు బాల్క సమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్ కూడా నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.