కొండా సురేఖ ఇష్యూ... ఇద్దరి అరెస్ట్!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్‌రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కి చెందిన వ్యాపారి మహేష్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ రఘునందనరావు ఈ మార్ఫింగ్ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు. తన ఫొటో, కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్ చేసినవారితోపాటు కేటీఆర్, హరీష్‌రావు, పలు యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా రఘునందనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.