సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని చిన్ని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు  ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. శనివారం (జులై 27) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ భేటీలో  పాల్గొనేందుకు చంద్రబాబు  శుక్రవారం (జులై 26) సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.

ఢిల్లీలో చంద్రబాబుకు ఎంపీ కేశినేని చిన్ని స్వాగతం పలికారు.  కాగా నీతి ఆయోగ్  సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం  కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు.