నిజాం నవాబు మళ్లీ పుట్టాడు

 

తెదేపా సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను నిజాం నవాబుతో పోల్చి ఎద్దేవా చేశారు. నిజాం నవాబును ఎవరు మెచ్చుకోరని, అలాంటి నిజాం నవాబును కేసీఆర్ మెచ్చుకోవడం, గొప్పవాడిగా కీర్తించడం నిజాం ప్రతిరూపానికి కేసీఆర్ నిదర్శనం అని విమర్శించారు. అతి క్రూరంగా పాలించి, ప్రజలకు నరకం చూపించిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడని అన్నారు. నిజాం నవాబు ఎలాగైతే దళితులను, ఇతర వర్గాలను అణచివేశారో కేసీఆర్ కూడా అదే తరహాలో దళితులను అణచివేస్తున్నారని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu