కరోనాపై ఇద్దరు సీఎంల ట్వీట్ రచ్చ! 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృందం మోగిస్తోంది. రోజురోజుకు మరణాలు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ నిండిపోవడంతో కరోనా రోగులకు చికిత్స అందడం లేదు. ఆక్సిజన్ అందక చూస్తుండగానే పిట్టల్లా రాలిపోతున్నారు. కోవిడ్ కట్టడిపై కేంద్రం సీరియస్ యాక్షన్ చేపట్టింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడి చర్యలపై సమీక్షించారు. 

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయ ప్రధానమంత్రి తనతో మాట్లాడారని, కానీ ఆయన ఏమనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప, తన మాటలేవీ ఆయన వినిపించుకోలేదని సోరేన్ వాపోయారు. కరోనా కష్టకాలంలో ఏంచేయాలో దాని గురించి మాట్లాడితే బాగుండేదని, తాము తీసుకుంటున్న చర్యల గురించి వింటే సంతృప్తికరంగా ఉండేదన్నారు. 

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ ద్వారా స్పందించారు."డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే... మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో ఒకరిని వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు" అని సీఎం జగన్ హితవు పలికారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu