హర్యానాలో మళ్లీ రాజుకున్న జాట్ల సెగ..

రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో రెండు నెలల క్రితం జాట్లు చేసిన ఆందోళనతో దేశం మొత్తం కంపించింది. ఎలాగో అప్పుడు బిల్లు పెడతామని ఉద్యమాన్ని సైలెంట్ చేశారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర కేబినెట్ జాట్‌లతో పాటు మరో ఐదు కులాలను ఓబీసీలో చేర్చింది. అయితే ఈ చట్టం అమలుపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రెండు రోజుల క్రితం స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం జాట్‌ కులస్తులకు ఆగ్రహన్ని కలిగించడంతో వారు మరోసారి ఉద్యమానికి పిలుపునిచ్చారు. జూన్ 5 నుంచి హిసార్ జిల్లా మాయర్ గ్రామం నుంచి దీనిని మొదలుపెట్టాలని జాట్ సంఘర్ష్ సమితి నేతలు రొహ్‌తహ్ జిల్లా బసంతపూర్‌లో జరిగన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నిషేధం మే 28 నుంచి జులై 27 వరకు అమల్లో ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu