ఎంటీసీఆర్.. భారత్ కు సభ్యత్వం

 

ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యర్ధ దేశాలు చైనా, పాకిస్థాన్ దేశాలు కూడా బాగానే అడ్డుపడుతున్నాయి. అయితే ఇప్పుడు కొంతలో కొంత ఊరటగా.. ఎంటీసీఆర్ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్) లో భారత్ కు సభ్యత్వం లభించింది. దీంతో ఇక నుండి ఇండియాలో తయారు చేసే పృథ్వి తరహా క్షిపణులను ఇకపై విదేశాలకు విక్రయించవచ్చు. దీనిలో భాగంగానే.. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్.. నేడు జరిగే ఓ కార్యక్రమంలో, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్ ప్రతినిధుల సమక్షంలో ఎంటీసీఆర్ పై సంతకాలు చేయనున్నారు. ఈ సందర్భంగా 48 దేశాల అణు సరఫరాల బృందంలో చేరలేకపోయిన తరుణంలో ఎంటీసీఆర్ లో పూర్తి సభ్యత్వం శుభపరిణామమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu