మెట్రోపై వార్తలు అవాస్తవం: కేటీఆర్

 

మైట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా లేఖ రాసిందని వచ్చిన వార్తలు అవాస్తవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కొంతమంది మెట్రో రైలు ప్రాజెక్ట్ను వివాదం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ఆయన తెలిపారు. మెట్రోపై ఎల్అండ్టీ లేఖ రాసినట్లు మీడియాలో చూసినట్లు కేటీఆర్ అన్నారు. ఈ వార్తను కొందరు కావాలని పనిగట్టుకుని రాసినట్టుగా ఉందని ఆయన విమర్శించారు. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్అండ్టీ లేఖ ఇప్పుడు రాసింది కాదని.. పాతదేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు తమమధ్య జరుగుతూనే వుంటాయని ఆయన అన్నారు.