జగనన్న అగ్గిపెట్టెలపై విచారణ!

పులివెందులలో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళని నిర్మించడానికి ఉద్దేశించిన జగనన్న మెగా లేఔట్‌లో అక్రమాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ లేఔట్ పేరుతో 8,400 ఇళ్లను మంజూరు చేసి, వాటిని అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేశారన్న విమర్శలు వున్నాయి. ఈ లేఔట్ మీద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సీఎం విచారణకు ఆదేశించారు. మూడేళ్ళ క్రితం ఇక్కడ స్థలాలు మంజూరయ్యాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ద్వారా కాంట్రాక్టర్‌కి 60 కోట్ల బిల్లులు వెళ్ళాయిగానీ, పనులు జరగలేదు. ఆ తర్వాత మరో ఏడు సంస్థలను ఎంపిక చేసి దాదాపు 85 కోట్ల బిల్లులు చెల్లించారు. 6,990 ఇళ్ళ నిర్మాణం జరగాల్సి వుండగా, కేవలం 99 ఇళ్ళను మాత్రమే నిర్మించారు.