చైనాలో భూకంపం: 150 మంది మృతి

 

చైనా వాయువ్య ప్రాంతంలోని యునాన్ రాష్ట్రం వెన్‌పింగ్ సమీపంలో భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 150 మంది మృతిచెందినట్లు సమాచారం. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.1గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. యునాన్‌లోని లాంగటౌషన్‌వద్ద భూకంప కేంద్రం కనుగొన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.1970 యున్నస్ సంభవించిన భూకంపంలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu