సర్దుబాటు వడ్డన

Difficulties in Power Supply, Fuel Compression Charges, Shock To Power Users, Discums Demands, APERC Decission, Open Debate In November

 

రాష్ట్రంలో విద్యుత్ రంగం గాడిన పడే అవకాశాలు కనిపించటం లేదు. ఒకవైపు శీతాకాలంలోనూ విద్యుత్ కోతలతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు డిస్కాంలు అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీలు 980 కోట్లమేర ప్రతిపాదనలను సమర్పించారు. విద్యుత్ యూనిట్ చార్జి అదనంగా 82 పైసలు వడ్డించేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కాంలు కోరాయి. నవంబర్ నెలలో బహిరంగ విచారణ తర్వాత ఈ అంశంపై ఏపిఇఆర్‌సి నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇప్పటికే ఏపిఇఆర్‌సి వద్ద 2165 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జిల వడ్డన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించిన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి ఏ క్షణమైనా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇంధన సర్దుబాటు చార్జీలతో వినియోగదారులు కుదేలవుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో వర్షాకాలం, శీతాకాలం అనే తేడా లేకుండా విద్యుత్ సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట డిస్కాంలు సొమ్మును వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu