తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

సోమవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 64వేల894 మంది దర్శించుకున్నారు. వారిలో 23, 355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చింది.