తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.

శనివారం (జులై27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 నుంచి 18 గంటల సమయం పడుతోంది.

ఇక శుక్రవారం (జులై 26) శ్రీవారిని మొత్తం 65 వేల 980 మంది దర్శించుకున్నారు. వారిలో 27, 441 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చింది.