తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం శ్రీవారిని మొత్తం 76వేల మంది దర్శించుకున్నారు. వారిలో 23వేల577 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

 శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం శ్రీవారి సర్వదర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు.  టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు స్వామి వారిని దర్శించుకునేందుకు పది గంటలకు పైగా సమయం పడుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu