శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (నవంబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

ఇక టోకెన్లు లేని భక్తులకు అయితే శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం (నవబర్ 2) శ్రీవారిని మొత్తం 66 వేల 48 మంది దర్శించుకున్నారు.

వారిలో 24వేల 666 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu