తిరుమలేశుని సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  శనివారం (జులై 6) ఉదయం స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 10 గంటల సయమం పడుతోంది. ఇక శుక్రవారం (జులై 5) స్వామి వారిని మొత్తం 65వేల 775 మంది దర్శించుకున్నారు.

వారిలో పాతిక వేల 216 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 41 లక్షల రూపాయలు వచ్చింది.