తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. మంగళవారం (ఫిబ్రవరి 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం (ఫిబ్రవరి 19) శ్రీవారిని 64వేల 741 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 24 వేల 667 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 82లక్షల రూపాయలు వచ్చింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu