టీడీపీ ఆఫీసుపై దాడి దారుణం

 

నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద టీఆర్ఎస్ దాడి దారుణమని, ఈ దాడిని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ అన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తే రైతుల ఆత్మహత్యలు జరిగేవి కాదని దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వం కరవు నివేదికలను సకాలంలో కేంద్రానికి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విషయంలో ఏపీ సీఎం ఉదారంగా వుండాలని సూచించారు. అలాగే జీహెచ్‌ఎంసీని విభజిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్నదని దత్తాత్రేయ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu