అలా చేస్తే మిమ్మల్ని ఉప రాష్ట్రపతి చేయరు.. కేజ్రీవాల్

 

ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు మధ్య తరచూ వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కు లేఖ రాస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీకి మద్దతుగా ఉండి ప్రజావ్యతిరేక పనులు చేస్తే ఆయనేమీ మిమ్మల్ని దేశ ఉపరాష్ట్రపతిని చెయ్యరు అంటూ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పనిలో కేంద్రం అడ్డుతగులుతోందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మా ప్రభుత్వం నిన్ననే వంద సీట్లతో మెడికల్‌ కళాశాల ప్రారంభించింది.. ఇక దానిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యమని మీ ఏసీబీ టీంతో చెప్పండి, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ ఇంటిపై దాడలు చేయించమని ప్రధాని మోదీతో చెప్పించండి.. అంటూ కేజ్రీవాల్‌ లేఖలో రాశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu