లోకేశ్ చెప్పింది నిజమే.. చంద్రబాబు

 

ఏపీ కోటాలో రాజ్యసభకు నాలుగు సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు సీట్లలో మూడు టీడీపీకి.. ఒకటి వైసీపీకి దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కావడంతో ఒక స్థానం బీజేపీకి వెళ్తుందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు తమను సంప్రదించలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకశ్ చెప్పారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఏపీ కోటాలోని ఓ సీటును ఇవ్వాలని తాము టీడీపీని అడిగామని, ఈ దిశగా ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విరుద్దంగా ప్రకటించారు. ఇక దీనిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి.. తన కుమారుడు నారా లోకేశ్ చెప్పింది నిజమేనని.. సీటివ్వాలని బీజేపీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారు. దీంతో అమిత్ షా ప్రకటన తప్పని తేల్చేశారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu