తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె... పెట్రోల్ దొరికేది రెండు రోజులే..

 

తమపై విధిస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్నును తక్షణం తొలగించాలని తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు అర్ధ్ర రాత్రి నుండి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని వందలాది పెట్రోల్ బంకులకు పెట్రోలు, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రెండు రోజుల వరకూ సరిపోతుంది.. అప్పటి వరకూ సమ్మె విరమించకుంటే పెట్రోలు కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు ఆరోపిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె గురించి తెలుసుకున్న వాహనదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, తెలంగాణలోని ట్యాంకర్ల సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్నామని ఏపీ ట్యాంకర్ల సంఘం ప్రకటించింది. తెలంగాణ బంకులకు తాము పెట్రోలు సరఫరా చేయబోమని స్పష్టం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu