భళా ఫ్లిప్‌కార్ట్..స్మార్ట్‌ఫోను బదులు నిర్మా సబ్బు పంపారు..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై ముంబైలో కేసు నమోదైంది. వాల్కేశ్వర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4 ఫోన్ ఆర్డర్ చేస్తే మే 30న డెలివరీ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ప్రకారం రూ.29,000 చెల్లించి ఎంతో ఆనందంగా బాక్స్ ఓపెన్ చేసిన ఆనంద్ అవాక్కయ్యాడు. అందులో ఫోన్‌కు బదులు నిర్మా సోప్, అండ్రాయిడ్ ఫోన్ చార్జర్ ఉన్నాయి.వెంటనే డెలివరీ బాయ్‌కి ఫోన్ చేసి పిలవగా, అతడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పాడు. కానీ కస్టమర్ కేర్ వాళ్లు దాన్ని తప్పుడు ఫిర్యాదుగా కొట్టేయడంతో ఆనంద్ మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్ ఇవ్వాలి లేదా తన డబ్బు వాపస్ ఇవ్వాలని చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేశానని, వాళ్లు ఏ మాత్రం వినిపించుకోకపోవడంతో ఇక ఫిర్యాదు చేయక తప్పలేదని ఆనంద్ మీడియాతో చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu