ఏమిటీ దారుణం? పంట అమ్మ‌డానికి నిబంధ‌న‌లా?

మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? అంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘాటుగా స్పందించారు. రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో రైతులు తాము పండించిన పంటను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. ఈ దారుణం కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో జరిగింది. 

ఈ విషయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?" అంటూ నిలదీశారు.